- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Team India: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. చెన్నైకి చేరుకున్న హిట్మ్యాన్, విరాట్
దిశ, వెబ్డెస్క్: టీమిండియాతో బంగ్లాదేశ్ (Bangladesh) టెస్ట్ సిరీస్ ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు మొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిందంబరం స్టేడియం వేదికగా జరగనుంది. అయితే, తొలి టెస్టు ఆడేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma), బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ (Virat Kolhi) ఇవాళ చెన్నై (Chennai)కి చేరుకున్నారు. పట్టిష్టమైన భద్రతా సిబ్బంది నడుమ వారు చెన్నై ఎయిర్పోర్టు నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ.. హోటల్కు వెళ్లిపోయారు. టీమిండియా బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురువారమే చెన్నైకి చేరుకున్నారు.
దాదాపు నెల రోజుల విరామం తరువాత టీమిండియా ఆటగాళ్లు ఎలాగైనా టెస్ట్ సిరీస్ (Test Series) కొట్టాలని గ్రౌండ్లోకి దిగబోతున్నారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ను ప్రారంభించనుంది. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్లో టీమిండియా ఆడిన 9 మ్యాచ్లలో 6 విజయాలు సాధించి అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా ఆడిన 12 మ్యాచ్లలో ఎనిమిదింట్లో గెలిచి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో 6 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి కివీస్ (New Zealand) కొనసాగుతోంది. ఒకవేళ ప్రస్తుతం బంగ్లాదేశ్తో టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్లలో గెలిస్తే.. పాయింట్స్ టెబుల్లో ఏం టీమ్ మన దరిదాపుల్లో ఉండవు.