విరాట్ కోహ్లీపై గౌతం గంభీర్ కావాలనే అలా చేశాడు : పాక్‌ మాజీ క్రికెటర్‌

by Vinod kumar |
విరాట్ కోహ్లీపై గౌతం గంభీర్ కావాలనే అలా చేశాడు : పాక్‌ మాజీ క్రికెటర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఆర్సీబీ రన్ మిషన్ విరాట్‌ కోహ్లి- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతం గంభీర్‌ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఆటగాళ్ల మధ్య గంభీర్‌ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదని నాదిర్‌ అలీ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు స్టేడియంలోనే గొడవ పడటం తనను బాధించిందన్నాడు.

లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌- ఉల్‌- హక్‌ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్‌ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed