- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రెజ్లింగ్ టోర్నీలో అన్షు, అంతిమ్లకు రజతం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : హంగేరీ జరుగుతున్న బుడాపెస్ట్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు అన్షు మాలిక్(57 కేజీలు), అంతిమ్ పంఘల్(53కేజీలు) రజత పతకాలు సాధించారు. శుక్రవారం తమ విభాగాల్లో జరిగిన ఫైనల్లో వీరు పరాజయం పాలై సిల్వర్ మెడల్తో సరిపెట్టారు. అన్షు 1-12 తేడాతో చైనా రెజ్లర్ హాంగ్ కెక్సిన్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో అంతిమ్పై 0-4 తేడాతో జోనా మాల్మ్గ్రెన్(స్వీడెన్) విజయం సాధించింది. మరోవైపు, 50 కేజీల కేటగిరీలో వినేశ్ ఫొగట్ క్వార్టర్ ఫైనల్లో 0-5 తేడాతో జియాంగ్ ఝూ(చైనా) చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం రెండో పతకాలు దక్కడంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అన్షు, అంతిమ్, వినేశ్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story