- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారత్ బంగ్లా రెండో టెస్ట్ మ్యాచ్.. నాలుగో రోజు ముగిసిన ఆట
దిశ, వెబ్ డెస్క్ : కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్ vs బంగ్లాదేశ్(IND vs BAN) రెండో టెస్ట్.. నాలుగవ రోజు మ్యాచ్ ముగిసింది. రెండు, మూడో రోజు వర్షం వలన మైదానం సహకరించక మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా నాలుగవ రోజైన సోమవారం మ్యాచ్ ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 26/2 స్కోర్ చేసింది. బంగ్లా నేడు తొలి ఇన్నింగ్స్ 107/3తో ప్రారంభించి, 233 పరుగులకు ఆలౌటయింది. మోమినుల్ 107, శాంటో 31, మిరాజ్ 20 పరుగులు చేయగా.. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ రెండేసి వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా ధాటిగా ఆడుతూ.. 285/9 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి 72, రోహిత్ 23, గిల్ 39, పంత్ 9 పరుగులు చేశారు. ఆ తర్వాత కోహ్లీ 47, రాహుల్ 68 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ 4/41, షకీబ్ 4/78 తో అలరించారు.