- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
IND vs AUS 3rd ODI: టీమిండియాతో మూడో వన్డే.. ఆ ఇద్దరు స్టార్లు రీఎంట్రీ..!
దిశ, వెబ్డెస్క్: టీమిండియాతో రేపు జరుగబోయే మూడో వన్డేలో ఇద్దరు ఆసీస్ స్టార్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డే బరిలో నిలువనున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇవాళ జరిగిన నెట్స్ సెషన్లో పాల్గొన్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు జరుగబోయే చివరి మ్యాచ్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు రాజ్కోట్ వేదికగా తలపడనున్నాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ ఇదివరకే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
మరోవైపు రేపటి మ్యాచ్లో టీమిండియా స్టార్లు సైతం రంగంలోకి దిగనున్నారు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రేపటి మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా రేపటి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. నామమాత్రపు మ్యాచ్ అయినా భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తుంది.