పారా ఒలంపిక్స్ లో గోల్డ్, కాంస్యం.. అదరగొట్టిన అమ్మాయిలు

by M.Rajitha |
పారా ఒలంపిక్స్ లో గోల్డ్, కాంస్యం.. అదరగొట్టిన అమ్మాయిలు
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ లో జరుగుతున్న పారా ఒలంపిక్స్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్ విభాగంలో అవనీ లేఖరా బంగారు పతకం సాధించగా.. ఇదే ఈవెంట్ లో మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని నెగ్గింది. మూడు రౌండ్లలో 249.7 పాయింట్స్ సాధించి తొలి స్థానంలో నిలవగా, మోనా 228.7 పాయింట్స్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో పారా ఒలంపిక్స్ రెండో రోజు భారత్ పతకాల పట్టికలో ఖాతా తెరిచింది. కాగా రాజస్థాన్ కు చెందిన అవనీ టోక్యో ఒలంపిక్స్ లో కూడా పతకాలు సాధించింది. అదే జోరు పారిస్ లోనూ కొనసాగిస్తోంది.

Next Story

Most Viewed