Breaking: భారత్ కు బిగ్ షాక్.. ప్రీక్వార్టర్స్ లో స్టార్ పారా ఆర్చ‌ర్ ఓటమి

by Maddikunta Saikiran |
Breaking: భారత్ కు బిగ్ షాక్.. ప్రీక్వార్టర్స్ లో స్టార్ పారా ఆర్చ‌ర్ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త‌ స్టార్ పారా ఆర్చ‌ర్ శీత‌ల్ దేవీ(Sheetal Devi) కు మహిళల వ్యక్తిగత పోటీలలో చుక్కెదురైంది. గురువారం జరిగిన పారాలింపిక్స్‌ క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆమె.. ఉమెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్ లో ఓట‌మి పాలైంది. శనివారం జ‌రిగిన పోటీలో చిలీ ఆర్చ‌ర్ మ‌రియానా జునిగ‌(Mariana Zuniga) చేతిలో కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడాతో శీత‌ల్ ఓటమిపాలయింది. నువ్వా నేనా అన్న‌ట్టు సాగిన పోరులో 137-138తో ప‌రాజ‌యం పాలైంది.

శీత‌ల్ తొలి సెట్ ను 29-28తో గెలుచుకోగా, రెండో రౌండ్‌లో జునిగ 27-26తో పైచేయి సాధించింది.ఇక మూడో రౌండ్‌లో ఇద్ద‌రూ పోటాపోటీగా పాయింట్లు సాధించ‌గా 27-27తో స్కోర్ స‌మం అయింది. ఇక నిర్ణ‌యాత్మ‌క నాలుగో రౌండ్‌లోనూ శీత‌ల్, జునిగ‌లు స‌మాన పాయింట్లు సాధించారు. దీంతో విజేతను నిర్ణ‌యించే ఐదో రౌండ్‌లో శీత‌ల్ ప్ర‌త్య‌ర్థికి గ‌ట్టి పోటీనిచ్చింది. కానీ చివ‌ర‌కు ఒకే ఒక పాయింట్‌తో 137-138తో ఎవరు ఊహించ‌ని విధంగా ప‌రాజ‌యం పాలైంది.వ్యక్తిగత విభాగంలో నిరాశ పరిచిన శీతల్ మిక్సుడ్ విభాగంలో పతకం సాధించే ఛాన్స్ ఉంది. కాగా రెండు చేతులు లేకపోయినా శీతల్ రెండు కాళ్లతో ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed