కివీస్‌తో పోరుకు భారత మహిళల జట్టు ఎంపిక

by Harish |   ( Updated:2024-10-17 16:01:07.0  )
కివీస్‌తో పోరుకు భారత మహిళల జట్టు ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టింటి. ఈ నెలాఖరులో కివీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ గురువారం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. రిచా ఘోష్, ఆశా శోభన, పూజ వస్త్రాకర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. మరోవైపు, వికెట్ కీపర్ యాస్తికా భాటియా తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి చోటు పదిలం చేసుకుంది. అలాగే, సెలెక్టర్లు నలుగురు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవల ఆస్ట్రేలి ఏపై మూడు హాఫ్ సెంచరీలు బాదిన తేజాల్ హసబ్నిస్‌ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికైంది. అలాగే, ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు చెందిన సయాలి సట్గారె, ప్రియా మిశ్రా, యూపీ వారియర్స్ పేసర్ సైమా ఠాకూర్‌లు కూడా పిలుపు అందుకున్నారు. మూడు వన్డేలు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి. ఈ నెల 24న తొలి వన్డే జరగనుంది.

భారత మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, రోడ్రిగ్స్, యాస్తికా భాటియా, , ఉమా ఛెత్రి, సయాలి సట్గారె, అరుంధతి రెడ్డి, రేణుక, తేజాల్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.

Advertisement

Next Story

Most Viewed