మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓటమి..

by Vinod kumar |
మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓటమి..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 103 రన్స్ చేసింది. భారత్ బ్యాటర్స్‌లో కెప్టెన్ హార్మన్ 40 పరుగులతో రాణించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆటగాళ్లు 18.2 ఓవర్లకు 103 రన్స్ చేసి విజయం సాధించారు. బంగ్లా ఓపెనర్ షమీమా సుల్తానా 42 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. మరోవైపు మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 కైవసం చేసుకుంది.

Advertisement

Next Story