Asia Cup 2023 Ind Vs Pak: టీమిండియాతో మ్యాచ్.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌

by Vinod kumar |
Asia Cup 2023 Ind Vs Pak: టీమిండియాతో మ్యాచ్.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే జట్టు వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా.. నేపాల్‌తో ఆరంభ మ్యాచ్‌ ఆడిన టీమ్‌నే కొనసాగించింది. భారత్‌తో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని పాకిస్థాన్ క్రికెట్ ట్వీట్ చేసింది.

పాకిస్తాన్‌ :

ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్.

Advertisement

Next Story