విజయం తర్వాత యువీ, భజ్జీ, రైనా వెరైటీ సెలబ్రేషన్స్.. తమను కించపరిచారని పోలీసులకు ఫిర్యాదు

by Mahesh |
విజయం తర్వాత యువీ, భజ్జీ, రైనా వెరైటీ సెలబ్రేషన్స్.. తమను కించపరిచారని పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ వేదికగా జూలై 12 జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌ మ్యాచ్ పాకిస్తాన్, భారత ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత చాంపియన్స్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ సురేష్ రైనా వెరైటీ స్టైల్ లో గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోలు యువరాజ్, రైనా, హర్భజన్ కుంటుతూ కనిపించారు. దీంతో వారు వికలాంగులను అవహేళన చేశారంటూ.. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఫర్ డిజేబుల్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను పోస్ట్ చేసిన వీడియోపై హర్భజన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే తన వీడియో వలన ఎవరికైన మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed