ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు ప్రత్యేక అధికారి

by srinivas |
ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు ప్రత్యేక అధికారి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. కమిషనర్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ ఆర్పీ సిసోడియాను నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 8 కింద ఏబీవీపై నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ చేపట్టనున్నారు. అలాగే అభియోగాలపై వాదనకు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలకు సంబంధించి వివరణను నిర్ణీత సమయంలో సమర్పించాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది.

Next Story

Most Viewed