జీతాల్లో కోతపై సింగరేణి కార్మికుల ఆందోళన

by  |
జీతాల్లో కోతపై సింగరేణి కార్మికుల ఆందోళన
X

దిశ, ఆదిలాబాద్: వేతనాల్లో కోతను నిరసిస్తూ సింగరేణి కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కార్మికులు, ఏఐటీయూసీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన ఓసీపీ-1 మొదటి షిఫ్ట్ కార్మికులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. కార్మికుల ఆందోళనతో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై రావును పోలీసులు వదిలేశారు. అయినా, తమ ఆందోళన విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.

Tags: singareni,workers,protest,memorandum



Next Story

Most Viewed