మోదీతోనే దేశం సుభిక్షం : బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

by Disha Web Desk 15 |
మోదీతోనే దేశం సుభిక్షం : బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు
X

దిశ, వర్గల్ : కాంగ్రెస్ తో భద్రత కరువని, మోదీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు కారుకు పంక్చర్ చేయడంతో పాటు కాళేశ్వరంలో ముంచారని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వస్తే భద్రత కరువని, దేశంలో బాంబులు పేలుతాయని, మోదీ రాకతో అలాంటి పరిస్థితి రాలేదని, దేశం సుభిక్షంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రజలను వంచించి కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కొకపేటలో రూ. వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి భూములు కొనడానికి డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు.

కేసీఆర్, హరీష్ రావుల దొంగ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4వేల ఉన్న ఎల్ఈడీ లైట్లు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 350 లకే అందించారని, 500 సంవత్సరాలుగా మనం కోరుకున్నటువంటి రామ మందిరం కట్టించిన ఘనత మోదీదే అని అన్నారు. వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన వారికి రఘునందన్ రావు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు టేకులపల్లి బాల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శృతి, అధికార ప్రతినిధి నందన్ గౌడ్, నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దిండి నాగరాజు, శ్రీరాం శ్రీకాంత్, పంపరి రమేష్, పాండు, బద్రినాథ్, రవీందర్ గౌడ్, యశ్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story