మార్కెట్లకు తప్పని నష్టాలు!

by Harish |
మార్కెట్లకు తప్పని నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా భయాలు వీడకపోవడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. దీనికి తోడు అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు సైతం మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సోమవారం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమై సాయంత్రానికి 5 శాతం అధిక నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 1375.27 పాయింట్ల నష్టంతో 28,440 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 379.15 పాయింట్లు కోల్పోయి 8,281 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలతో క్లోజయ్యాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed