రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఐపీఎస్ విశ్వనాథ్ రవీందర్.

by Shyam |
state-precident
X

దిశ వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ లోని లయన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. అయితే ఎటువంటి పోటీ లేకుండా విశ్వనాథ రవీందర్ ఎన్నికయినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన విశ్వనాథ్ రవీందర్ క్షత్రియులు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. విద్యార్ధులందరూ ఏకాగ్రతతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు క్షత్రియ వంశ మూలపురుషుడు సహస్రార్జున చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. క్షత్రియుల అభివృద్ది కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప్పల్ దగ్గర 30 గుంటల భూమి 75 లక్షల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టంకు విష్ణు, పుజారి రాజేశ్వర్, డా. అశోక్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed