వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

by srinivas |
వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..
X

దిశ, వెబ్‌డెస్క్ : నివర్ తుఫాన్ ధాటికి ఏపీ రాష్ట్రం విలవిల లాడుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో నెల్లూరు జిల్లా తిప్పవరప్పాడు దగ్గర ఓ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. బస్సుకు అటు వైపు, ఇటువైపు రెండు కాలువలు ఉన్నాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆ సమయంలో బస్సులో సుమారు 47 మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుఫాన్ ధాటికి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed