రూ.30 లక్షల నకిలీ పత్తి విత్తనాలు సీజ్

by  |
రూ.30 లక్షల నకిలీ పత్తి విత్తనాలు సీజ్
X

దిశ, నల్లగొండ: జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్‌ను ఛేదించి, 23 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, ప్యాకింగ్ సామాగ్రి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ ఏ.వి.రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. చండూర్ మండలంలోని కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబుల్ లేకుండా ఉన్న విషయం చండూర్ పోలీసుల దృష్టికి వచ్చింది. విచారణ ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం ఉన్న రాకెట్‌గా తేలింది. దీంతో ఎస్పీ రంగనాథ్ ఏఎస్పీ సతీష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఠాకు సంబంధించి గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఏపీలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా నల్లగొండ జిల్లా పరిధిలోని గుర్రంపోడు, నకిరేకల్, శాలిగౌరారం, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన మరికొందరి పాత్ర వెల్లడైంది. ఇలా మొత్తంగా 23 మందిని అరెస్ట్ చేశారు. అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.


Next Story

Most Viewed