ప్రమాదం ఎదురై.. ఇద్దరి ప్రాణాలు తీసింది

by Shyam |   ( Updated:2020-05-18 00:36:16.0  )
ప్రమాదం ఎదురై.. ఇద్దరి ప్రాణాలు తీసింది
X

దిశ, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాయచూరు నుంచి వస్తోన్న టెంపో వాహనం దేవరకద్ర శివారులోని చౌదర్పల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed