పండుగ పూట కామారెడ్డిలో తీవ్ర విషాదం

by  |   ( Updated:2021-11-03 22:16:07.0  )
nzb-Accident-1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పండుగ పూట కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి క్రిష్ణామందిర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు చెట్టుని ఢీకొనడంతో అక్కడికక్కడే 7 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు నిజామాబాద్ పట్టణంలోని బర్కత్ పురి కాలనీకి చెందిన వాసులుగా గుర్తించారు. గల్ఫ్ వెళ్లిన బంధువుకు వీడ్కోలు పలికి ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed