నోటిసులు ఇచ్చి ఖాళీ చేయించండి !

by Shyam |
నోటిసులు ఇచ్చి ఖాళీ చేయించండి !
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఆ భవనాల్లో నివాసం ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ సోమవారం అలర్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యజమానులకు తెలిపాలని సూచించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed