- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కార్లు అద్దెకు తీసుకుని తాకట్టు.. రూ.2 కోట్లకు కుచ్చుటోపి
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : అవసరం రీత్యా కార్లు అద్దెకు తీసుకుని ఆపై తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పలు వాహన ఏజెన్సీ సంస్థల నుంచి అవసరం రీత్యా కార్లను అద్దెకు తీసుకుని ఆ తర్వాత వాటిని తాకట్టు పెట్టి డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 29 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలో ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులో ఉండగా, మరొకరు తప్పించుకున్నారు. ప్రధాన నిందితుడు పార్వతీపురానికి చెందిన చంద్రమౌళిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story