‘హాథ్రస్ ఘటనపై ప్రధాని స్పందించాలి’

by Shamantha N |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబ సభ్యులను యోగి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed