కరోనాతో భార్య మృతి..తాజాగా భర్తకు పాజిటివ్

by vinod kumar |
కరోనాతో భార్య మృతి..తాజాగా భర్తకు పాజిటివ్
X

దిశ, మహబూబ్ నగర్ :
తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. మొన్నటిదాకా గ్రేటర్‌కే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కమ్మేస్తోంది. తాజాగా నాగర్‌ కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని శ్రీ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. నాలుగు రోజుల కిందట అతని భార్య కరోనా పాజిటివ్‌తో మరణించగా, ఇప్పుడు భర్తకు పాజిటివ్ అని తేలింది. దీంతో సదరు వ్యక్తిని వైద్యాధికారులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దీంతో కలిపి ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరాయి.

Advertisement

Next Story

Most Viewed