రెండేళ్ల తర్వాత ఆ ఖాతా నుంచి పవన్ ట్వీట్..

by Shyam |
రెండేళ్ల తర్వాత ఆ ఖాతా నుంచి పవన్ ట్వీట్..
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అశేషంగా ఉన్న తన అభిమానులకు దేవుడు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు రెండూ చేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్’ రిమేక్ ‘వకీల్ సాబ్’లో నటిస్తూనే..క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీ చేస్తున్నారు. అయితే, పవన్ డైరెక్షన్‌లో వచ్చిన జానీ మూవీ 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల అప్పటి విషయాలను గుర్తు చేస్తూ నిన్న ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పవన్ డైరెక్షన్ లో వచ్చిన ‘జానీ’ మూవీలో ఆయన హీరోగా నటించగా, మాజీ భార్య రేణుదేశాయ్ హీరోయిన్‌గా నటించింది. రమణ గోగుల ట్వీట్‌కు స్పందనగా ఈరోజు పవన్ అప్పటి ఫొటో ఒకటి పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఓ ఖాతా, సినిమాల గురించి మాట్లాడేందుకు మరో ఖాతా అంటూ పవన్ గతంలో చెప్పారు. ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ పేరిట ఉన్న ఖాతాను 2018లో పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ అప్‌డేట్స్, ‘ఖుషి’, ‘రంగస్థలం’ గురించి తమ అభిప్రాయాలను చెప్పిన తర్వాత ఆ ట్విట్టర్ ఖాతాను పవన్ ఉపయోగించలేదు. రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఇప్పుడు ‘వకీల్ సాబ్’తో మరోసారి ఫ్యాన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో, ఆ ఖాతాను తిరిగి తెరిచారు. నాడు స్వయంగా నటించి, డైరెక్షన్ చేసిన ‘జానీ’ సినిమా అనుభవాలను పవన్ పంచుకున్నారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలో రిక్షా తొక్కుతున్న సందర్భం గురించి, అందులో ఉన్న తన దర్శకత్వ టీమ్ గురించి మాట్లాడారు పవన్. పవన్ తన సినిమాలను గురించి చెప్పేందుకు మరోసారి ట్విట్టర్‌ను వాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Tags: pawan kalyan, movies, politics, johnny, movie 17 years, completion, ramana gogula

Next Story

Most Viewed