నేను ఆరోగ్యంగా ఉన్నా: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

by  |
నేను ఆరోగ్యంగా ఉన్నా: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
X

దిశ, పటాన్‌చెరు: నియోజకవర్గ ప్రజల దీవెనలతో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం నియోజకవర్గ ప్రజలకు ఓ వీడియో సందేశం పంపారు. కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్నారని వీడియోలో తెలిపారు. అపోలో ఆసుపత్రి వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.


Next Story

Most Viewed