ప్రమాదానికి గురైన పేపర్ వాహనం.. ఒకరు మృతి 

by Sumithra |
ప్రమాదానికి గురైన పేపర్ వాహనం.. ఒకరు మృతి 
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: ప్రముఖ ఆంగ్ల పత్రిక రవాణా చేసే వాహనం ప్రమాదానికి గురై డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రతి రోజు హైదరాబాద్ నుండి రాయచూరుకు హిందూ పేపర్ ను తీసుకెళ్లే వాహనం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి వెళ్తున్న వాహనాన్ని మహబూబ్ నగర్ శివారులోని ధర్మపుర్ స్టేజ్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలకు చేరుకోగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed