ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘స్త్రీ-2’ .. కానీ ఓ ట్విస్ట్!

by Hamsa |
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘స్త్రీ-2’ .. కానీ ఓ ట్విస్ట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు కలిసి నటించిన బూవీ ‘స్త్రీ-2’. దీనిని డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కించాడు. అయితే ఇది 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన స్త్రీ-2 ఆగస్టు 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అంతేకాకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, స్త్రీ-2 అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఓ ట్విస్ట్.. అదేంటంటే.. అద్దె ప్రాతిపదికన (రూ. 349) అందుబాటులో ఉంది.

Advertisement

Next Story

Most Viewed