టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బిగ్ షాక్.. నోటీసులు జారీ

by srinivas |
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బిగ్ షాక్.. నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై ఫోకస్ పెట్టింది. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు జగన్ సర్కార్ నోటీసులు పంపించింది. అయితే.. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. దీంతో ట్రస్టును స్వాధీనం చేసుకునే క్రమంలో సర్కార్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed