నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా బస్వాలక్ష్మి నర్సయ్య బాధ్యత స్వీకరణ

by Shyam |
నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా బస్వాలక్ష్మి నర్సయ్య బాధ్యత స్వీకరణ
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా బస్వాలక్ష్మి నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. అదివారం జిల్లా కార్యాయలంలో ప్రత్యేక పూజల అనంతరం నూతన అధ్యక్షునిగా రాష్ర్ట క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు లోకభూపతి రెడ్డి చేతుల మీదుగా పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్బంగా ఆయనకు పలువురు కార్యకర్తలు, జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, నాయకులు పల్లె గంగారెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, గీతా రెడ్డి, కల్పన రెడ్డి, ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, వెంకటేశ్, పోతన్కర్ లక్ష్మి నారాయణలు ఉన్నారు.

tags ; nizamabad bjp president narsaiah, mp arvind, charge taken, district office

Next Story

Most Viewed