పనితోనే సమాధానం చెప్తా : నిత్యా మీనన్

by  |
పనితోనే సమాధానం చెప్తా : నిత్యా మీనన్
X

క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్.. ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న నిత్య.. అందానికి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ తాను బరువు పెరగడంపై మాత్రం కొద్ది రోజులుగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె.. బాడీ షేమింగ్‌పై ఎవరెన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోనని తెలిపింది.

మనకంటే సన్నగా ఉన్న వారే ఇలాంటి విమర్శలు చేస్తారన్న ఆమె.. కానీ ఎందుకు బరువు పెరుగుతున్నావు? అని తెలుసుకునే ప్రయత్నం చేయరంది. ఎవరికి వారు ఇష్టారీతిన ఊహించుకుంటూ.. విమర్శించే ప్రయత్నం చేస్తారని తెలిపింది. తన బరువు గురించి పట్టించుకునే వాళ్లను, ప్రశ్నించే వాళ్లను ఎప్పుడూ ఎదురు ప్రశ్నించలేదన్న నిత్య.. ఇలాంటి కామెంట్లపై స్పందించి టైమ్ వేస్ట్ చేయదలుచుకోలేదని చెప్పింది. ఇండస్ట్రీలో కూడా ‘నా బరువు చూస్తున్నారా? నన్ను చూస్తున్నారా? అనే విషయం పక్కనపెట్టి.. నా పని నేను చేసుకుపోతానని’ తెలిపింది. నా సక్సెస్ వారికి సమాధానం చెప్తుందని నమ్ముతున్నానని తెలిపింది నిత్య. చివరగా బాలీవుడ్ మూవీ ‘మిషన్ మంగళ్’లో కనిపించిన నిత్య.. త్వరలో వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Next Story

Most Viewed