పానీపూరి ఘటన: మానవ హక్కుల కమిషన్ నోటీసులు

by  |

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం కలుషిత పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. లాక్‌డౌన్ సమయంలో పానీపూరి బండి ఎలా తెరిచి ఉంచారని ఎస్‌హెచ్‌ఆర్సీ ప్రశ్నించింది. ఈ విషయంలో మున్సిపల్, కార్పొరేషన్, పోలీసు శాఖల వైఫల్యంపై కమిషన్ మండిపడింది. హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఫిర్యాదు మేరకు కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో తమ ముందు హాజరుకావాలని మున్సిపల్, పోలీసు శాఖను కమిషన్ ఆదేశించింది.



Next Story

Most Viewed