- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
'ఏమైంది మీ ఐడియాలజీ..?'.. ఉద్ధవ్ థాక్రేపై దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్
న్యూఢిల్లీ : శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ థాక్రేపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్ బుక్స్ నుంచి సావర్కర్, హెడ్గేవార్లకు సంబంధించిన పాఠాలను తొలగించినా శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ థాక్రే నోరు మెదపకపోవడం ఆయన సైద్ధాంతిక భావజాలంలో వచ్చిన మార్పుకు నిదర్శనమని కామెంట్ చేశారు. "ఇప్పుడు ఎక్కడికి పోయింది మీ ఐడియాలజీ" అని ఉద్ధవ్ను నిలదీశారు.
"అధికారం కోసమే మైనారిటీ వర్గాల బుజ్జగింపులు జరుగుతున్నాయని మీరు అంగీకరిస్తారా..? వీర సావర్కర్ జీకి జరిగిన ఈ అవమానాన్ని అంగీకరిస్తారా..? కుర్చీ కోసం మాట్లాడకుండా ఊరుకుంటారా..? మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పండి" అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నలు సంధించారు.
"సావర్కర్ మాకు రోల్ మోడల్.. దేవుడితో సమానం.. ఆయనకు ఏదైనా అవమానం జరిగితే సహించం. సావర్కర్ను కించపరిచే చర్యలు విపక్ష కూటమిలో చీలికలను సృష్టిస్తాయి" అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచిస్తూ.. ఇటీవల ఉద్ధవ్ థాక్రే కామెంట్స్ చేశారు. ఇప్పుడు స్కూల్ బుక్స్ నుంచి సావర్కర్ లెస్సన్ను కర్ణాటక సర్కారు తీసేసినా ఉద్ధవ్ స్పందించలేదు.