- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తమిళనాడులో కాలేజీ బిల్డింగ్ నుంచి దూకిన ట్రైనీ డాక్టర్
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ డాక్టర్ క్యాంపస్ లోని బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరునెల్వేలికి చెందిన 23 ఏళ్ల యువతి, కాంచీపురంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఐదో సంవత్సరం చదువుతున్నది. అదే హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నది. కాగా, ఆదివారం రాత్రి మెడికల్ కాలేజీ క్యాంపస్లోని బిల్డింగ్ ఐదో అంతస్తులో కిటికీ వద్ద షెర్లిన్ చాలా సేపు కూర్చొవడాన్ని కొంతమంది విద్యార్థులు గమనించారు. అయితే, ఆమె ఉన్నట్టుండి బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ట్రైనీ డాక్టర్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మరోవైపు, ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె గతకొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నట్లుగా తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు.