5వ అంతస్తు నుంచి దూకిన ట్రైనీ డాక్టర్.. సీసీటీవీలో రికార్డ్!

by Julakanti Pallavi |
5వ అంతస్తు నుంచి దూకిన ట్రైనీ డాక్టర్.. సీసీటీవీలో రికార్డ్!
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన ట్రైనీ వైద్యురాలి హత్యోదంతం మరిచిపోక ముందే తాజాగా మరో ట్రైనీ వైద్యురాలి మరణం సంచలనంగా మారింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మీనాక్షి మెడికల్ కాలేజీకి చెందిన ఓ ట్రైనీ డాక్టర్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని తిరునెల్వేలికి చెందిన షెర్లిన్ (23)గా పోలీసులు గుర్తించారు. షెర్లిన్ ప్రస్తుతం అదే కాలేజీలో ఐదో సంవత్సరం చదువుతోంది. అలాగే ట్రైనీ డాక్టర్‌గానూ విధులు నిర్వర్తిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కాలేజీ క్యాంపస్‌లోని బిల్డింగ్‌ ఐదో అంతస్తు కిటికీ వద్ద షెర్లిన్ చాలా సేపు కూర్చుని ఉండడం కొంత మంది విద్యార్థులు గమనించారు. ఆమె కిటికీలో కూర్చుని ఉన్న దృశ్యాలు సీసీటీవీలో కూడా రికార్డయ్యాయి. అయితే చాలా సేపు కిటికీ వద్దే కూర్చున్న షెర్లిన్ ఉన్నట్లుండి పై నుంచి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆమెని ఆసుపత్రికి తరలించారు. కానీ కొద్ది గంటల్లోనే ఆమె మరణించింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. షెర్లిన్ కొంత కాలంగా వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని, ఆ కారణాలతోనే ఆమె మరణించి ఉంటుందని అనుమానిస్తున్నామని ఓ పోలీస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed