Tragedy:ఘోరం.. గణేషుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఎనిమిది మంది యువకులు మృతి..ఎక్కడంటే..?

by Maddikunta Saikiran |
Tragedy:ఘోరం.. గణేషుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఎనిమిది మంది యువకులు మృతి..ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్:గుజరాత్‌(Gujarat) రాష్ట్రం గాంధీనగర్(Gandhinagar) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గణేషుడిని నిమజ్జనం చేయడానికి వెళ్లిన 8 మంది యువకులు నదిలో మునిగి చనిపోయారు. వివరాల్లోకి వెళితే..గాంధీనగర్ జిల్లా దేగాం(Dehgam) తాలూకాలోని వస్నా సోగ్తి(Vasna Sogthi) గ్రామానికి చెందిన కొంత మంది యువకులు వినాయకున్ని నిమజ్జనం చేసేందుకు శుక్రవారం సాయంత్రం మెష్వో నది(Meshwo River)కి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ నీటిలో మునిగిపోయాడు.అతడిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత మరొకరు నదిలో దూకి మునిగిపోయారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ఈ ఘటనపై ప్రధాని(Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) స్పందిస్తూ.. మెష్వో నదిలో 8 మంది మునిగి చనిపోయారన్న వార్త చాలా బాధ కలిగించిందని,జరిగిన సంఘటన పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాని 'ఎక్స్(X)'లో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed