- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
'హిందూయిజం దేశానికే కాదు.. ప్రపంచానికే ముప్పు'
తమిళనాడు: ‘హిందూ మతం దేశానికే కాదు ప్రపంచానికి పెనుముప్పు’ అని డీఎంకే ఎంపీ ఎ. రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తమిళనాడులో కులాల ప్రాతిపదికన ప్రజలను విభజించి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి డీఎంకే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. వాళ్లు సృష్టించిన గందరగోళానికి సనాతన ధర్మాన్ని నిందించడాన్నీ అన్నామలై తప్పుబట్టారు.
ఆయన షేర్ చేసిన వీడియోలో డీఎంకే నేత రాజా మాట్లాడుతూ.. ‘కులం పేరుతో సృష్టించిన ప్రపంచవ్యాప్త వ్యాధికి, కులాన్ని ఉపయోగించి ప్రజలను ఆర్థిక పంథాలో విభజించడానికి భారతదేశం కారణం. సామాజిక దురాచారాలకు మాత్రమే కులాన్ని ఉపయోగించలేం. అది ఆర్థిక కారణాలపైనా ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల్లోని భారతీయులు కూడా హిందూ మతం పేరుతో కులాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి హిందూ మతం కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి పెనుముప్పు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
DMK MP A Raja calls Hindu Religion a menace to India & the world.
— K.Annamalai (@annamalai_k) September 12, 2023
DMK is the principal reason for creating caste divide & hatred in TN, and the DMK MP has the audacity to blame Sanatana Dharma for the mess they made. pic.twitter.com/fqWO9FiQqY