'హిందూయిజం దేశానికే కాదు.. ప్రపంచానికే ముప్పు'

by Vinod kumar |
హిందూయిజం దేశానికే కాదు.. ప్రపంచానికే ముప్పు
X

తమిళనాడు: ‘హిందూ మతం దేశానికే కాదు ప్రపంచానికి పెనుముప్పు’ అని డీఎంకే ఎంపీ ఎ. రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తమిళనాడులో కులాల ప్రాతిపదికన ప్రజలను విభజించి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి డీఎంకే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. వాళ్లు సృష్టించిన గందరగోళానికి సనాతన ధర్మాన్ని నిందించడాన్నీ అన్నామలై తప్పుబట్టారు.

ఆయన షేర్ చేసిన వీడియోలో డీఎంకే నేత రాజా మాట్లాడుతూ.. ‘కులం పేరుతో సృష్టించిన ప్రపంచవ్యాప్త వ్యాధికి, కులాన్ని ఉపయోగించి ప్రజలను ఆర్థిక పంథాలో విభజించడానికి భారతదేశం కారణం. సామాజిక దురాచారాలకు మాత్రమే కులాన్ని ఉపయోగించలేం. అది ఆర్థిక కారణాలపైనా ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల్లోని భారతీయులు కూడా హిందూ మతం పేరుతో కులాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి హిందూ మతం కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి పెనుముప్పు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed