- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
వారంత భక్తులు మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి: అఖిలేష్ యాదవ్
![వారంత భక్తులు మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి: అఖిలేష్ యాదవ్ వారంత భక్తులు మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి: అఖిలేష్ యాదవ్](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415961-akhilesh-yadav.webp)
దిశ, వెబ్ డెస్క్: మహాకుంభమేళ(Mahakumbh Mela)లో ఈ రోజు మౌని అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివచ్చారు. దీంతో మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో సెక్టార్ 2 లో తొక్కిసలాట(Stampede) జరిగి పలువురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై యూపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాకుంభం(Mahakumbh Mela)లో జరిగిన అసంఘటిత ప్రమాదంలో భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరం. వారందరికీ నా నివాళులు అర్పించారు. అలాగే తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఉత్తమ ఆసుపత్రులకు తరలించి వెంటనే వైద్య చికిత్స అందించాలి. మృతుల మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించి వారి నివాసానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.
అలాగే తమ బంధువులతో విడిపోయిన వారిని తిరిగి కలపడానికి తక్షణమే కృషి చేయాలి. హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని కుంభమేళ(Mahakumbh Mela)లో నిఘా పెంచాలి. ఈ క్లిష్ట సమయంలో భక్తులు సంయమనం, సహనం పాటించి వారి తీర్థయాత్రను శాంతియుతంగా పూర్తి చేయాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నేటి ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల బస, వసతి, భోజనం, నీరు తదితర సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలి. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్ లో "'ప్రపంచ స్థాయి వ్యవస్థ' అనే వాదనలో నిజం బయటపడింది.
కాబట్టి ఈ దావాను అసత్య ప్రచారం(False propaganda) చేస్తున్నవారు ఈ సంఘటనలో మరణించిన వ్యక్తుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు. కాగా కుంభమేళ(Mahakumbh Mela) సందర్భంగా మౌని అమావాస్య ఘడియలు ప్రారంభం అయినప్పటి నుంచి అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా తెల్లవారుజామున 8 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని సీఎం యోగీ (CM Yogi) ప్రకటించారు. అయితే తొక్కిసలాట ఘటనకు జరిగినట్లు అధికారులు నిర్దారించినప్పటికి.. కోట్లాది మంది భక్తులు ప్రస్తుతం అక్కడే ఉండటం వల్ల.. మృతుల వివరాలను తెలిపేందుకు అధికారులు, యంత్రాంగం సిద్ధంగా లేరని తెలుస్తోంది.