- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గౌరవ్ గొగోయ్ భార్య పాక్ లింకులపై సిట్

- వెల్లడించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో డిప్యూటీ అపోజిషన్ లీడర్ గౌరవ్ గగోయ్ భార్య ఎలిజబెట్ కాల్బర్న్కు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్కు పాకిస్తాన్తో లింకులు ఉన్నాయన్న విషయంపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారని, ఆ అంశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ అస్సాంకు సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో ఉన్న ఎవరెవరితో ఐఎస్ఐ సంప్రదింపులు జరిపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంత మంది సానుభూతిపరులు ఉన్నారో అనే విషయాలు సీట్ విచారణలో తేలుతుందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. కాగా, ఈ విషయంపై గౌరవ్ గొగోయ్ ఇప్పటికే స్పందించారు. బీజేపీ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని, తాను వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.