భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఇకపై ఆ దేశానికి ఫ్రీ వీసా

by Jakkula Mamatha |   ( Updated:2024-08-29 09:18:28.0  )
భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఇకపై ఆ దేశానికి ఫ్రీ వీసా
X

దిశ,వెబ్‌డెస్క్: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు భారీ గుడ్ న్యూస్. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రజెంట్ చాలామంది బిజీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో కుటుంబం తో గడిపేది చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి క్రమంలో ఫ్రీ టైం ఉంటే కుటుంబంతో కలిసి ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా గడపాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లాల‌నుకునే భార‌తీయుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త పౌరుల‌కు ఆరు నెల‌ల పాటు ఉచిత‌ వీసా సౌక‌ర్యం క‌ల్పించనున్నట్లు సమాచారం. భారత్‌‌తో సహా 35 దేశాల వారికి ఈ వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు తాజాగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణ‌యం అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed