రాహుల్ గాంధీకి అదే కావాలని ఉంది.. న్యాయ్ యాత్రలో అదే చేశారు.. రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
రాహుల్ గాంధీకి అదే కావాలని ఉంది.. న్యాయ్ యాత్రలో అదే చేశారు.. రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయనకి ట్రావెల్ వ్లాగర్ కావాలని ఉందని, భారత్ న్యాయ్ యాత్రలో అదే చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆమె పార్టీ అగ్రనేతలైన రాహుల్ ప్రియాంక లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలవడానికి మూడు సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నానని, ఎన్ని సార్లు సమయం అడిగినా వారెవరూ నన్ను కలవలేదని అన్నారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేసిన సమయంలో కూడా ఎవ్వరిని కలవలేదని, ఓ ఐదు నిమిషాలు ప్రజల్లో తిరిగి మళ్లీ తన ట్రైలర్ లోకి వెళ్లిపోయేవారని తెలిపారు.

బహుషా ఆయన ట్రావెల్ వ్లాగర్ కావాలని కోరుకుంటున్నాడేమో? న్యాయ యాత్ర సమయంలో అదే విధంగా ప్రవర్తించాడని దుయ్యబట్టారు. నేను ప్రియాంక గాంధీని కలవడానికి ప్రయత్నించానని, ఆమె నన్నే కాదు ఎవరిని కలవడానికి ఇష్టపడలేదని అన్నారు. అంతేగాక ప్రియాంకగాందీ నేను అమ్మాయిని అయినా పోరాడగలను అని పదే పదే చెబుతారని కానీ, ఆడపిల్లలు ఏం చేయలేరనేదే కాంగ్రెస్ నినాదమని రాధిక ఖేరా ఆరోపించారు. కాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగాఉన్న రాధిక ఖేరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed