Tirupati: దాహం.. దాహం.. మూడవ రోజు సైతం నిలిచిపోయిన తాగు నీటి సర్ఫరా..

by Indraja |
Tirupati: దాహం.. దాహం.. మూడవ రోజు సైతం నిలిచిపోయిన తాగు నీటి సర్ఫరా..
X

దిశ వెబ్ డెస్క్: ఎపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండతాపానికి ఆరిన గొంతు తడుపుకునేందుకు తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీటి సర్ఫరా నిలిచిపోయి రోజులు గడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్య దోరనితో వ్యవహరిస్తున్నారు. దీనితో తిరుపతి జిల్లా ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో మూడు రోజుల నుండి తాగు నీటి సర్ఫరా నిలిచిపోయింది. ఎస్‌ఎస్ ట్యాంకులు వద్ద విద్యుత్ నియంత్రిక పనిచేయండంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరాల్సిన నీరు చేరడం లేదు. దీనితో తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇంబ్బందులను ఎదుర్కుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed