PM Modi : ఇజ్రాయెల్ ప్రధానికి భారత ప్రధాని ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..

by Hajipasha |
PM Modi : ఇజ్రాయెల్ ప్రధానికి భారత ప్రధాని ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో :లెబనాన్‌‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై యుద్ధానికి సంబంధించిన వ్యూహ రచనలో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తీరుపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.

శాంతి, సుస్థిరతల సాధన కోసం భారత్ తనవంతు సాయాన్ని అందించేందుకు సదా సిద్ధంగా ఉంటుందని నెతన్యాహూకు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన వివిధ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఈసందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదని మోడీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed