సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. వాటి ధరలు భారీగా పెంపు?

by Rajesh |
సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. వాటి ధరలు భారీగా పెంపు?
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. నిత్యావసరరాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడినట్లు అయింది. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 22న పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో సిలిండర్ ధర రూ.వెయ్యికి పైగా చేరుకుంది. దీంతో సిలిండర్ గ్యాస్ కొనాలంటేనే సామాన్యులు భయపడే రోజులు వచ్చేశాయి. అయితే త్వరలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్యులకు మరో షాక్ తప్పేలా కనిపించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed