- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
స్మృతి ఇరానీపై కిషోరి లాల్ శర్మ కూతురు విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి అమేథీలో గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడు అయిన కిషోరి లాల్ శర్మ తాజాగా జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి స్మృతి ఇరానీపై 1,60,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో కిషోరి లాల్ కూతురు అంజలి, ఇరానీపై విమర్శలు చేశారు. ‘‘స్మృతి ఇరానీ మా నాన్నను, ప్యూన్, ప్రాక్సీ, సేవకుడు, చీమ అని ఎలాగైనా పిలవవచ్చు.. మేము వాటిని పట్టించుకోము.. దానికి సమాధానంగా ఈ నంబర్లే మాట్లాడుతాయి. ఆమె ప్రియాంక గాంధీ గారిని అనుకరించింది.. అది చాలా బాగుంది, స్మృతి ఇరానీ మంచి నటి” అని అంజలి అన్నారు.
అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్మృతి ఇరానీ ఒక సమావేశంలో కిషోరి లాల్ శర్మను ''ప్యూన్" అని "ప్రియాంక గాంధీ "గుమాస్తా" అని పిలిచారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా శర్మ చిన్న కుమార్తె అంజలి ఇరానీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమె అన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో ఓడిపోగా 2024 లో కిషోరి లాల్ శర్మను పోటీగా దింపారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం శర్మ మాట్లాడుతూ, ఇది అమేథీ ప్రజలు, గాంధీ కుటుంబం విజయమని అన్నారు. అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి చెందింది. వారు నాపై ఉంచిన నమ్మకానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానని శర్మ చెప్పారు.