కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్.. బీజేపీలో చేరిన భారత రిచ్చెస్ట్ మహిళ

by Disha Web Desk 12 |
కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్.. బీజేపీలో చేరిన భారత రిచ్చెస్ట్ మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీని వీడి.. బీజేపీలో చేరతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ, హర్యానా మాజీ మంత్రి 84 ఏళ్ల సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది గంటల తర్వాత ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. కాగా ఆమె కుమారుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ పార్టీని విడిచిపెట్టి కాషాయ పార్టీలో చేరిన కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా బీజేపీలో చేరారు.

సావిత్రి జిందాల్ బీజేపీలో చేరిన తర్వాత.. ఇలా స్పందించారు. “గౌరవనీయమైన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీ నాయకత్వంలో, నడ్డా మార్గదర్శకత్వం, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ నాయకత్వం, ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, నేను, నా బృందం మొత్తం భారతీయ జనతా పార్టీ, మోడీ కుటుంబంలో గౌరవ సభ్యులుగా చేయబడ్డాము. అందుకు నేను పార్టీ నాయకత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.“మాకు ఇంత గౌరవం ఇచ్చిన హర్యానా, హిసార్ పార్టీ అధికారులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు. అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మోదీజీ కలను సాకారం చేసేందుకు మేమంతా కలిసి కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు.


Next Story

Most Viewed