- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
జపాన్ ప్రధానిపై దాడిని ఖండించిన ప్రధాని మోడీ
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని ఫుమియో కిషిండాపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశారు. భారత్ ఎల్లవేళలా హింసను ఖండిస్తుందని పేర్కొన్నారు. కాగా, శనివారం ఓ ప్రచార కార్యక్రమానికి సమీపంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. అయితే కిషిండా అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడంతో ప్రాణప్రాయం తప్పింది.
అప్రమత్తమైన సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది మాజీ ప్రధాని షింజో అబే కూడా ప్రసంగ కార్యక్రమంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా దాడి భద్రతపై సందేహాలను లేవనెత్తింది. మరోవైపు వచ్చే నెలలో హిరోషిమా వేదికగా జీ7 సమావేశం జరగనుంది.
Advertisement
Next Story