Ravindra jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా!

by vinod kumar |
Ravindra jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా!
X

దిశ, నేషనల్ బ్యూరో: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి తాజాగా బీజేపీలో చేరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ఫొటోలను ఆయన భార్య రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల బీజేపీ సభ్యత్వ డ్రైవ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జడేజా మెంబర్ షిప్ పొందారు. కాగా, రివాబా జడేజా భార్య రివాబా సైతం 2019 నుంచి కాషాయ పార్టీలోనే ఉన్నారు. అంతేగాక గుజరాత్‌లోని నార్త్ జామ్‌నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే జడేజా తన భార్యతో కలిసి తరచూ ప్రచారం చేస్తూ రోడ్‌షోల్లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు అధికారికంగా బీజేపీలో జాయిన్ అయ్యారు. కాగా, రవీంద్ర జడేజా ఇప్పటివరకు 72 టెస్టుల్లో 3,036 పరుగులు, 294 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 197 మ్యాచ్‌లు ఆడి, 2,756 పరుగులు, 220 వికెట్లు తీశారు. టీ20ల్లో అతను 74 మ్యాచ్‌లలో 515 పరుగులు, 54 వికెట్లు పడగొట్టారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed