- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేంద్ర మంత్రి రవ్నీత్సింగ్ బిట్టు(Ravneetsingh Bittu) సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలను వేదికగా చేసుకొని రాహుల్ గాంధీ సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్(terrorist) అని.. ఆయన తలపై కేంద్రం రివార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా గత వారం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్.. వాషింగ్టన్ డీసీ(Washington DC)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ- సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా.. వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే వాటిపైనే భారత్లో ఘర్షణలు జరుగుతున్నాయని. అన్ని మతాలకు ఇదే పరిస్థితి తప్పడం లేదనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఖలీస్తాన్ మద్దతుదారులు సపోర్ట్ గా నిలవగా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.