ప్రియాంకా గాంధీ ‘ఇన్ కా జీ20’ కామెంట్స్‌పై బీజేపీ కౌంటర్

by Vinod kumar |
ప్రియాంకా గాంధీ ‘ఇన్ కా జీ20’ కామెంట్స్‌పై బీజేపీ కౌంటర్
X

న్యూఢిల్లీ : ‘‘వాళ్ల (ఇన్ కా) జీ20 సదస్సు వేదిక దగ్గరకు వరదలు పోటెత్తాయి’’ అని ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడమనేది యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించే అంశమని.. ఇలాంటి విషయాలను కూడా వాళ్లది, వీళ్లది అని ప్రియాంక ప్రస్తావించడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ‘‘జీ20 సదస్సుకు ఆతిథ్యం అనేది వాళ్ల దా, వీళ్లదా లేదా భారత్ దా?’’ అని ప్రశ్నించారు.

కుటుంబ పార్టీ మనస్తత్వం ఉండటం వల్లే ప్రియాంకా గాంధీ ఇలా ఈజీగా మాట్లాడగలుగుతున్నారని ఆరోపించారు. ‘‘దేశానికి చెందినదల్లా.. తమ కుటుంబానికి చెందినదే అనే ఫీలింగ్ లో ప్రియాంక ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు. కాగా, రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. “ఈ ఉదయం ఢిల్లీలోని వాళ్ల జీ 20 సదస్సు వేదిక దగ్గర వరదలు రావడం చూశాను’’ అని కామెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed